calender_icon.png 18 October, 2024 | 11:45 AM

గరిష్ఠానికి పసిడి ధరలు

18-10-2024 01:17:18 AM

ముంబై : భారత్‌లో  బంగారం ధరలు గురువారం చరిత్రలో తొలిసారిగా ఆల్టైమ్ హైకి చేరుకున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 76,899 వద్ద ట్రేడవుతున్నది. అయితే, బం గారం పెరుగుదలను కారణాలు అనేకం ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ప్రధానంగా సెంట్రల్ బ్యాంకుల వైఖరి, బాండ్ ఈల్డ్‌ల్లను తగ్గించడం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణాలని పేర్కొంటున్నారు.

ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. గత నెలలో వడ్డీ రేట్లలో కోత విధించిన విషయం తెలిసిందే.నవంబర్‌లోనూ 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టే అవకాశం ఉందని అంచనా. ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, లెబనాన్, ఇజ్రాయెల్ దా డుల నేపథ్యంలో మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు.