19-02-2025 10:28:19 AM
ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం
జనగామ,(విజయక్రాంతి): ఓ కంపెనీ తమ ప్రచారం కోసం ఉచితంగా చాయ్, బిస్కెట్ పంపిణీ చేయడంతో జనాలు ఎగబడ్డారు. కేవలం రూ.10 విలువ చేసే టీ కోసం వందలాది మంది గంటల తరబడి ప్రజలు క్యూలో నిల్చోవడం గమనార్హం. ప్రముఖ నీలోఫర్ టీ పౌడర్ కంపెనీ జనగామలో ఓ వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ అప్పగించింది. అయితే సదరు కంపెనీ చాయిపత్తాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీ వినూత్న ప్రచారానికి దిగింది. జనగామలోని నెహ్రూ పార్క్ వద్ద రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డులో ప్రధాన టెంటు వేసి అక్కడే తమ చాయిపత్తాతో చాయ్ తయారుచేసి ప్రజలకు ఉచితంగా అందజేశారు. చాయ్తో పాటు బిస్కెట్ కూడా అందజేశారు. నిత్యం జనాల తాకిడి ఉండే ప్రాంతం కావడంతో ఉచితంగా టీ, బిస్కెట్ తీసుకునేందుకు ప్రజలు బారులు తీరడంతో ఆ రోడ్డుపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఏర్పడి రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.