calender_icon.png 28 April, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

28-04-2025 08:35:02 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. తిరుమలతో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి(srivari sarva darshan) 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 78,177 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 23,694 మంది భక్తులు తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

వేసవి సెలవుల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి జులై 15 వరకు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే మే 1 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. స్వయంగా వచ్చే ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు కానుంది. జూలై 15 వరకు పరిశీలనాత్మకంగా అమలు చేయనున్నారు.