జీవో జారీ చేసిన ఇంధన శాఖ
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): టీజీ ట్రాన్స్కోకు రాష్ట్ర విద్యుత్ శాఖ రూ.958.33 కోట్లను విడుదల చేసింది. ఈమేరకు శనివారం ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల సబ్సిడీ నిమిత్తం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తోంది. ఇదే సమయంలో ఇతర అనుబంధ రం గాల్లో సబ్సిడీని అందిస్తోంది. ఈ క్ర మంలో వ్యవసాయ రంగానికి అక్టోబర్కు సంబంధించిన బిల్లులను టీజీ ట్రాన్స్కోకు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.