కృతజ్ఞతలు తెలిపిన గురుకులాల సొసైటీ అధ్యక్షుడు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): మైనార్టీ గురుకులాల భవనాలకు సంబంధించిన ౪ నెలల అద్దెను విడుదల చేయడంపై ప్రభుత్వానికి సొసైటీ వైస్చైర్మన్, అధ్యక్షుడు మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల పాఠశాలల భవనాల యజమానులకు తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వడంలో భాగంగా నాలుగు అద్దెగా రూ.28 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యజమానులు వారి భవనాలకు రిపేర్లు చేసుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భవన యజమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి సహకరిస్తున్న అద్దె భవనాల యజమానులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.