హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గృహజ్యోతి పథకానికి సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రూ.186 కోట్లను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విడుదల చేస్తూ విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ నెలకు సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని తాజాగా డిస్కంలకు విడుదల చేసింది.