ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు
మహారాష్ట్ర, సెప్టెంబర్ 29: అంబర్గ్రీన్ (తిమింగలాల వాంతి)ను స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మహారాష్ట్రలోని థానే క్రైమ్బ్రాంచ్లో కల్యాణ్ విభాగం శనివారం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.6.20 కోట్ల విలువైన 5.6 కిలోల అంబర్గ్రీన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పైప్లైన్ రోడ్ నుంచి బద్లాపూర్కు కారులో అంబర్గ్రీస్ను తరలిస్తున్నారని క్రైమ్బ్రాంచ్కు సమాచారం అం దింది.
దీంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. వీరిని అనిల్ భోస్లే, అంకుశ్శంకర్, లక్ష్మణ్ శంకర్ పాటిల్గా గుర్తించారు. నిందితులను మంగళవారం వరకు కస్టడీకి పంపినట్లు తెలిపారు.