calender_icon.png 14 October, 2024 | 4:50 AM

రెండురోజుల్లో రూ.352 కోట్లు

14-10-2024 02:11:19 AM

దసరా పండగతో జోరుగా మద్యం అమ్మకాలు

ఈ నెలలో ఇప్పటికే రూ.852.40 కోట్ల సెల్లింగ్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. పల్లె, పట్నం తేడా లేకుండా మద్యం ప్రియులు ఫుల్లుగా తాగేశారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరినట్లు తెలుస్తోంది.

ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో ఎక్సైజ్ శాఖకు గతనెల కంటే అధిక ఆదాయం వచ్చింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లో అధికంగా ఉన్నాయి.