ముంబై, అక్టోబర్ 11: స్టాక్ మార్కెట్ జోరు చూపించడం, పలు కంపెనీలు కొత్త ఇష్యూలను జారీచేయడంతో దేశంలో డీమ్యాట్ ఖాతాలు జోరుగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.5 కోట్లకు చేరినట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలిపింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 44 లక్షల ఖాతాలు ప్రారంభమయ్యాయన్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ ప్రతీ నెలలోనూ సగటున 40 లక్షల మేర కొత్త ఖాతాలు ఆరంభమయ్యాయని పేర్కొంది.