calender_icon.png 1 October, 2024 | 2:57 AM

300 రోజుల్లో 92 కోట్ల జీరో టికెట్లు

30-09-2024 01:25:05 AM

కరీంనగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, 300 రోజుల్లో మహిళలకు 92 కోట్ల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసిందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

మహాలక్ష్మీ పథకం ద్వారా 300 రోజుల్లో  రూ.3,123 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని వెల్లడించారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో 2.55 కోట్ల మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుని 100 కోట్ల వరకు ఆదా చేసుకున్నారని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సులు కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు.