న్యూఢిల్లీ, అక్టోబర్ 23: జీఎంఆర్ గ్రూప్కు అబుదాభి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఏఐ) రుణం రూపంలో రూ. 6,300 కోట్లు అందించనున్నది. తమ ప్రమోటింగ్ సంస్థ జీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ (జీఈపీఎల్) జారీచేసే రుణ పత్రాల్లో పెట్టుబడి చేసేందుకు ఏడీఏఐతో ఒక ఒప్పందం కుదుర్చు కున్నట్లు జీఎంఆర్ గ్రూప్ బుధవారం వెల్లడించింది. ఈ నిధుల్ని తమ పాత రుణాల రీఫైనాన్సింగ్కు ఉపయోగించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, గోవా విమానా శ్రయాలతో పాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియాల్లో రెండు ఎయిర్పోర్టులను నిర్వహి స్తున్న జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు జీఈపీఎల్ ప్రమోటర్గా ఉన్నది.