అల్యూమినియం టిన్నుల యూనిట్ ఏర్పాటు
పరిశ్రమతో 500 మందికి ఉపాధి అవకాశం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడి
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూ మ్స్ ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే ‘బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్’ కంపెనీ రాష్ర్టంలో రూ.700 కోట్ల పెట్టుబడితో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈ యూని ట్ ఏర్పాటుతో 500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ‘బాల్’ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ గణేశన్ మంత్రి శ్రీధర్బాబుతో సచివాల యంలో సమావేశం అయ్యారు.
తమ సంస్థ విస్తరణ ప్రణాళికను మంత్రి శ్రీధర్బాబుకు ఆయన వివరించారు. ‘బాల్’ సంస్థకు రాష్ర్టంలో అవరసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ర్టంలో టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ర్టలో బాట్లింగ్ అవుతున్నాయని తెలిపారు. కర్ణాటక, మహారాష్ర్టల్లో బీర్ల ప్యాకేజింగ్లో టిన్నుల వాడకం 25 శాతం వరకు ఉందని పేర్కొన్నారు. రాష్ర్టంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సుజ్ విధానంలో కొన్ని మార్పులు చేయా ల్సి ఉంటుందని వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎక్సుజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చిస్తానని పేర్కొన్నారు.
500 మిల్లీలీటర్ల పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సుజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్బాబు వివరించారు. కిందటిసారి తన అమెరికా పర్యటన సందర్భంగా జార్జియా రాష్ర్టంలోని అట్లాంటాలో ఉన్న కోకాకోలా కేంద్ర కార్యాల యానికి వెళ్లినప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటయ్యే కోక్ బాట్లింగ్ యూనిట్కు ‘బాల్’ సంస్థ అల్యూమినియం టిన్నులను చేస్తుందని చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తి ప్రణాళికను సమర్పించాలని గణేశన్కు శ్రీధర్ బాబు సూచించారు.