calender_icon.png 28 September, 2024 | 8:49 AM

ముల్కనూర్ రైతులకు 44 కోట్ల బోనస్

28-09-2024 12:33:05 AM

సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి

భీమదేవరపల్లి, సెప్టెంబరు 27: ముల్కనూర్ సహకార బ్యాంకులోని 7,500 మం ది రైతులకు నేటి వరకు రూ.44 కోట్లు బోన స్ రూపంలో అందించామని బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి  తెలిపారు. శుక్రవా రం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మ ండలం ముల్కనూర్ సహకార బ్యాంకు 68 వ వార్షిక మహాసభలో ఆయన మాట్లాడా రు.

అక్టోబర్ 4, 5 తేదీల్లో విజయదశమి సం దర్భంగా బోనస్ పంపిణీ చేస్తామన్నారు. దా దాపుగా ప్రతి కుటుంబానికి రూ.10 వేల ను ంచి రూ.20 వేల వరకు పంపిణీ చేస్తామని చెప్పారు. బ్యాంకు రూ.400 కోట్లు వ్యాపా రం చేసి ఏడు కోట్లు లాభాలు సంపాదించిందన్నారు. 

134 మంది రైతులు మృతి చెందితే 

రూ.కోటి మాఫీ చేసినట్టు చె ప్పా రు. రైతు రుణమాఫీ కింద 4,500 మందికి రూ.42 కోట్లు పంపిణీ చేశామన్నారు. వివిధ సంక్షే మ పథకాల కింద రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మహాసభలో జీఎం మా ర్పాటి రాంరెడ్డి, లోన్స్ మేనేజర్ గొల్లపల్లి రా జమౌళి, ఏడు వేల మంది రైతులు పాల్గొన్నారు.