calender_icon.png 13 March, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలు

13-03-2025 01:34:11 AM

ఐటీడీఏ పీవో బి.రాహుల్

బూర్గంపాడు,మార్చి12(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యాన్ని హాని తలపెట్టే పంటలు కాకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. బుధవారం మండలంలోని గుట్ట లక్ష్మీపురం గ్రామంలో అభ్యుదయ రైతు యారం లక్ష్మారెడ్డి సేంద్రీయ ఎరువులతో సాగు చేస్తున్న పుచ్చకాయ,మిరప,జామకాయ పంటలను ఆయన పరిశీలించారు.సేంద్రియ పంటలు పండించే విధంగా ఆదివాసి గిరిజన రైతులకు సాగులో మెలకువలు,సూచనలు,సలహాలు అందించాలని కోరారు.ఈ సందర్భంగా రైతు లక్ష్మారెడ్డిని పీవో అభినందించారు.పంటలు సాగు చేస్తున్న విధానాన్ని యాజమాన్య పద్ధతుల గురించి రైతును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పీవో రాహుల్ మాట్లాడుతూ గిరిజన రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందడానికి ఆర్గానిక్ పంటలు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. అభ్యుదయ రైతు పామాయిల్ మొక్కలు పెంచుతూ అంతర్ పంటలుగా రైతు సాగు చేస్తున్న పుచ్చకాయ,మిరప సాగు చేస్తున్న విధానం చాలా బాగుందని అన్నారు.ఎటువంటి హానికరం లేకుండా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్న లక్ష్మారెడ్డిని గిరిజన రైతులు ఆదర్శంగా తీసుకొని సేంద్రియ పంటలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏడి అగ్రికల్చర్ ఉదయభాస్కర్, హార్టికల్చర్ అధికారి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.