calender_icon.png 16 October, 2024 | 10:27 PM

సీతారామ కాలువలో ముసలి కలకలం

16-10-2024 08:27:22 PM

కృష్ణ సాగర్,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్ట్ కాలువలో ముసలి సంచారం కలకలం రేపుతోంది.  కాలువలో ముసలి తిరుగుతోందని రైతులు తెలపగా స్థానిక పంచాయతీ సెక్రెటరీ నాగిరెడ్డి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ రేంజ్ అధికారిణి సుజాత, బీట్ అధికారి ఉపేంద్ర కాలువ వద్దకు చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలువలో ముసలి ఆనవాళ్లను గుర్తించి పరిసరాల్లోని రైతులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళల్లో పొలాలకు వెళ్లొద్దని  హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.