calender_icon.png 19 October, 2024 | 12:19 PM

క్రిసిల్ నికరలాభం 13 శాతం వృద్ధి

17-10-2024 12:35:28 AM

మధ్యంతర డివిడెండు రూ.15

ముంబై, అక్టోబర్ 16: రేటింగ్ ఏజెన్సీ క్రిసల్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 13 శాతం వృద్ధిచెంది రూ. 171 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.152 నికరలాభాన్ని ఆర్జించింది. తాజా త్రైమాసికంలో క్రిసిల్ ఆదాయం రూ.771 కోట్ల నుంచి రూ.833 కోట్లకు పెరిగింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 15 చొప్పున మధ్యంతర డివిడెండు సిఫార్సుచేసింది.