05-04-2025 01:15:45 AM
షాద్ నగర్, ఏప్రిల్ 4( విజయక్రాంతి ) ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు వైద్యం చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం షాద్ న గర్ పట్టణంలో స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కీర్తి పాలీ క్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక భాగంలో ఉన్న దవాఖాన, మనిశ్విని క్లినిక్ లను సందర్శించి డాక్టర్ వెంకటేశ్వరరావు వాటిని సీజ్ చేశారు. కీర్తి క్లినిక్ పై డాక్టర్ రాజు అని పేరు రాసుకోవడం ను గుర్తించి ఇలా నిబంధనలకు విరుద్ధంగా రాసుకోవడం తప్పు అని డాక్టర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
పలు క్లినిక్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాథమిక వైద్యం చేయకుండా ఇష్టం వచ్చినట్లు పరిధి దాటి మరి కొందరు వైద్యం చేస్తున్నారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. పేర్కొన్నారు. ఆర్ఎంపీ లు, పీఎంపీలు డాక్టర్ అనే పదాన్ని అసలు వాడుకోవద్దని హెచ్చరించారు. ప్రధమ చికిత్స కేంద్రం అని మాత్రమే ఉండాలని, ఎవరు ప్రజా వైద్యశాల వైద్యశాల అని ఆసుపత్రి బోర్డులు పెట్టుకోరాదని హెచ్చరించారు.
పట్టణంలో ఆర్ఎంపీల వ్యవహారంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యులు సైతం ఇక్కడ విలవిలలాడే పరిస్థితి ఏర్పడిందని.. ఆ ధోరణి మారాలన్నారు. వారం రోజులపాటు నిరంతరంగా వైద్య ఆరోగ్యశాఖ దాడులు నిర్వహి స్తుందని హెచ్చరిం చారు. అనుమతి లేని ఆసుపత్రుల్లో బెడ్లు ఉండకూడదని సూచించారు. ఈరోజునుండి షాద్ నగర్ ప్రాంతం లో ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేస్తుందని అన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆర్ఎంపీల నియంత్రణ జరుగుతుందని సూచించారు. అనారోగ్యంతో బాధ పడేవారు కేవలం క్వాలిఫై డాక్టర్లను మాత్ర మే సంప్రదించాలని అనవసరంగా ఆర్ఎంపీలు, పీఎంపీ ల వద్దకు వెళ్లి తమ ప్రాణా లకు ముప్పు తెచ్చుకోవద్దన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం హెచ్వో డాక్టర్ విజయలక్ష్మి, మాస్ మీడియా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.