30-04-2025 01:04:00 AM
పెద్ద కొడప్గల్, ఏప్రిల్ 29: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం “అండర్ 17 క్రికెట్ టోర్నమెంట్” కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.
కాటేపల్లి లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా “మల్లప్ప పటేల్ “మాట్లాడుతూ ఆరు బయట ఆటలతో ఆరోగ్యం బాగుంటుందని పిల్లలు దృఢంగా ఉంటారని ప్రస్తుతం పిల్లలు,పెద్దలు చాలా మంది మొబైల్ తో నే కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుబయట ఆటలకు దాదాపు స్వస్తి పలికారని అన్నారు.
ఇది మంచి పరిణామం కాదన్నారు.పిల్లలు పెద్దలు అందరూ కనీసం రోజుకు గంట ఆరుబయట ఆటలు ఆడాలని తెలిపారు.పిల్లలు ఆటలతో పాటు చదువులో రాణించాలని కోరారు.తల్లిదండ్రులపేరును,గ్రామం పేరును నిలబెట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గోకన్ గంగాగౌడ్,నాయకులు ఇస్మాయిల్ పటేల్,ఆకుల రాంచందర్,అప్రోజ్ పటేల్,సీనియర్ మెట్టు సోంపేట రాందాస్,పాత్రికేయులు రమేష్ గౌడ్, యువకులు, గ్రామస్థులు,వివిద గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.