06-04-2025 02:35:50 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడ మైదానంలో ఆదివారం మార్నింగ్ క్రికెట్ గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గేట్ శ్రీనివాస్, సన్రైజెస్, బండారి ఫ్లై ఆక్స్, మై ఇండియన్స్, బ్రదర్స్ లెవెన్, గుడి పేట టైటాన్స్ జట్లు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు నిర్వాహకులు త్రాగునీరు, భోజన వసతి కల్పించారు. సాయంత్రం ఫైనల్ పోటీలు జరగనున్నాయి.