calender_icon.png 28 October, 2024 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ రోహిత్ రాజ్

28-10-2024 09:01:36 PM

మణుగూరు,(విజయక్రాంతి): గంజాయి వంటి మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే వారిపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. వర్టికల్స్ వారీగా ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు నిత్యం పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులో సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్ కుమార్, ఎస్సైలు రాజేష్, నాగ భిక్షం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.