హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశం భా గంగా తొలుత నూతన కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ భాస్కర్, జాయింట్ సెక్రటరీగా ఎన్ ఉపేందర్, కోశాధికారిగా మారం లింగారెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా శిరదాసు రామదాసు, సందీప్, నాగన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా తిరుపతి, శోభన్, బొమ్మనబోయిన శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.