calender_icon.png 20 April, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ సమస్యలపై ఎమ్మెల్యేకి సీపీఐ వినతి

18-04-2025 12:00:00 AM

బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 18 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు సమస్యలను పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురు వారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేశారు. పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ పట్టణ సమస్యలను ఎమ్మెల్యే వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి పాత క్వార్టర్సులలో నివసిస్తున్న వారికి డబ్బులు కట్టించుకుని కొంతమందికి జీవో నెంబర్ 76 ప్రకారం  కొంతమందికి పట్టాలు ఇచ్చారని తెలిపారు. డబ్బులు చెల్లించిన ఇంకా చాలా కొంతమందికి పట్టాలు రాలేదనీ పేర్కొన్నారు.  చాలా మంది పాత సింగరేణి క్వార్టర్స్లలో నివసిస్తు న్న వారికి కూడా నామమాత్రపు రుసుము తీసుకొని అందరికీ జీవో నెంబర్ 58, 59 ప్రకారంగా అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులందరికీ రేష న్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు.

ప్రభు త్వo రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా అందరికీ రేష న్ కార్డు అందిస్తే పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.  పట్టణంలో పారిశుద్ధ్యం లోపిందచిందన్నారు. అన్ని బస్తీలలో చెత్త రోడ్లపై పేరుకుపోతున్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి చర్యలు తీసుకోవాలిపకోరారు. బెల్లంపల్లి పట్టణానికి డంపు యా ర్డు అనేది సమస్యగా తయారైనదన్నారు.

ప్రజలు ఇబ్బంది పడకుండా ఆమోదయోగ్యమైన స్థలాన్ని గుర్తించి డంపు యార్డు ఏర్పా టు చేయాలని కోరారు. పట్టణంలోని అన్ని బస్తీలలో నీటి ఎద్దడి ఉన్నది మిషన్ భగీరథ ద్వారా నీటిని రెండు వారాలకోసారి, వారానికోసారి నీటి సరఫరా చేస్తున్నారనీ ఆరో పించారు. ప్రజలకు నీటి గురించి అవస్థలు పడుతున్నారు.

బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయనీ, అట్టి ప్రభుత్వ భూములను అధికా రులు శ్రద్ధ చూపి కబ్జాకు గురికాకుండా కాపాడగలరన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఐ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ,  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేకల రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, పట్టణ సమితి సభ్యులు అంబాల ప్రభుదాస్ పాల్గొన్నారు.