calender_icon.png 23 February, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

18-02-2025 12:00:00 AM

మహిళలకు అండగా కేంద్రాలు.. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్

మంచిర్యాల, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్‌కు వచ్చే వరకూ.., పరిహారం ఇప్పించే వరకు “భరోసా సెంటర్‌” అండగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. సిసిసి నస్పూర్ పాత పోలీస్ స్టేషన్ భవనంలో వున్న భరోసా సెంటర్ ను సీ పీ సోమవారం సందర్శించారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందన్నారు. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారన్నారు. లైంగిక దాడులకు గురైనా బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామ న్నారు. జిల్లాలో ఎక్కడైనా పోక్సో, లైంగికదాడుల కేసులు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా సెంటరుకు తీసుకొస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మహిళ పోలీస్ స్టేషన్ సీఐ నరేష్‌కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్‌కుమార్, మంచిర్యాల షీ టీమ్ ఇంచార్జి ఎస్‌ఐ హైమ, సిసి హరీష్ పాల్గొన్నారు.