తుంగతుర్తి (విజయక్రాంతి): అక్రమంగా ఆవులను డీసీఎంలో తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుండి అక్రమంగా మరిపెడ బంగ్లా మీదుగా, హైదరాబాద్ కు తరలిస్తున్న ఆవుల డీసీఎంను, గుర్తించి పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వాహనానికి ఎటువంటి నెంబర్ లేకపోవడం గమనార్హం. జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపే కేసులు నమోదు చేయనున్నట్టు ఎస్సై క్రాంతి కుమార్ పేర్కొన్నారు.