మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టిపల్లిలో గోవులు మృత్యు ఘోష అందరినీ కలిచివేసింది. కంటైనర్ లో ఊపిరాడక 15 ఆవులు మృత్యువాతపడ్డాయి. కంటైనర్ లో గోవులు తరలిస్తూ తమిళనాడు వ్యక్తలు పోలీసులకు చిక్కారు. తమిళనాడుకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కంటైనర్ లో 26 ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.