calender_icon.png 10 October, 2024 | 10:49 PM

పార్క్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం

09-10-2024 12:00:00 AM

ఆదిలాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో దంపతుల ఆత్మహత్యయత్నం ఘట న కలకలం రేపింది. తలమడుగు మండలం రుయ్యాడికి చెందిన రాజు, వైష్ణవి దంపతులు. గత మూడేళ్ల క్రితం వీరికి వివాహమైం ది. కుటుంబ కలహాల కారణంగా గత కొన్ని రోజులుగా మాండగడలోని తన పుట్టింట్లోనే వైష్ణవి ఉం టున్నది. మంగళవారం ఆదిలాబా ద్ వచ్చిన వైష్ణవి భర్తకు ఫోన్ చేసిం ది.

అనంతరం వారిద్దరూ స్థానిక గాంధీ పార్కుకు వెళ్లి రోజ్ వాటర్‌లో పురుగుల మందు కలుపు కొని తాగారు. గమనించిన స్థానికు లు అంబులెన్స్‌లో  రిమ్స్‌కు తరలించారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం. వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ రిమ్స్‌కు వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు.