13-02-2025 05:37:19 PM
పాపన్నపేట: ఈరోజు శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ చంద్రశేఖర్, దేవాదాయ శాఖ హుండీ ఇంచార్జ్ శ్రీమతి అంజలి దేవి సహాయ కమిషనర్, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. 52 రోజులకు గాను హుండీ ఆదాయం 47 లక్షల 33 వేల 787 రూపాయలు సమాకూరిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఆలయ సిబ్బంది, పాపన్నపేట పోలీస్ సిబ్బంది సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.