calender_icon.png 15 October, 2024 | 7:26 PM

శాంతిఖని గనిలో గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్..

15-10-2024 05:19:33 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లిలోని శాంతిఖని గని షాఫ్ట్ ఆవరణలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా ఆధ్వర్యంలో గైర్హాజరు కార్మికులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కంపెనీ ఆదేశాల ప్రకారం ప్రతీ నెల 16 కన్నా తక్కువ మస్టర్లు చేసిన కార్మికులకు కౌన్సెలింగ్ ఇస్తామని ఆయన తెలిపారు. శాంతిఖని గనిలో గత నెల సెప్టెంబర్ లో 16 కన్నా తక్కువ డ్యూటీలు చేసిన కార్మికులను పిలిచి వారి గైర్హాజరుకు గల కారణాలు తెలుసుకుని మరియు సింగరేణి ఉద్యోగం యొక్క ఆవశ్యకతను వారికి, వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భవిష్యత్తులో మళ్ళీ గైర్హాజరు కాకుండా విధిగా డ్యూటీలు చేసుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో గని సంక్షేమ అధికారి ఆర్. సత్యనారాయణ, ఏఐటీయుసీ ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.