సీడీఎంఏకు డిప్యూటీ మేయర్ ఫిర్యాదు
కరీంనగర్, అక్టోబరు 16 (విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్ కోరారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్కు వచ్చిన సీడీఎంఏకు వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్ పరిధిలో రూ.103 కోట్లతో సీఎం అస్యూరెన్స్ కింద ఎస్ఆర్ఆర్సీ సంస్థకు పనులు అప్పగించగా, వారు కేవలం 40 శాతం మేరకు పనులు మాత్రమే చేశారని ఆరోపించారు. సదరు కాంట్రాక్టర్ పనులపై విచారణ జరిపించాలని కోరారు. అసంపూర్తి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.