హవేలిఘనపూర్ : మెదక్ జిల్లా హవేలిఘనపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు. సీజ్ చేసిన ఇసుక టిప్పర్ ను వదిలిపెట్టేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పతకం ప్రకారం బాధితుడు ఎస్ఐ ఆనంద్ రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. హవేలిఘనపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు సోదాలు నిర్వహించారు.