calender_icon.png 18 October, 2024 | 12:05 AM

ప్రధాన రహదారి కల్వర్టు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

17-10-2024 09:38:46 PM

కాప్రా,(విజయక్రాంతి): చర్లపల్లి  డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని  డివిజన్ కార్పొరేట్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఐజి కాలనీ కల్వర్టు పక్కన ఉన్న రోడ్డు పలు కాలనీలను కలిపే ప్రధాన రహదారి, ఐజి కాలనీ, సెయింట్ జోసెఫ్ కాలనీ, నేతాజీ నగర్, వి ఆర్ కాలనీ,  విద్యా మారుతి నగర్, అంబేద్కర్ నగర్, టీఎస్ కాలనీ, లక్ష్మీ నగర్, డిసి కాలనీ, డాక్టర్స్ కాలనీ, లోకమాత కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించి స్థానిక సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ లో సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తాం పరిష్కరించేందుకు చర్య తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.