calender_icon.png 29 October, 2024 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల కార్పొరేషన్

01-08-2024 01:18:47 AM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా: ముత్తినేని వీరయ్య 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కరిస్తానని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హామీ ఇచ్చారు. సహకార సంస్థ ఉద్యోగుల సంఘం సభ్యులు బుధవారం హైదరాబాద్‌లో వీరయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ సమస్యను అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. త్వరలోనే కార్పొరేషన్ ఉద్యోగులకు తీపికబురు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేస్తానన్నారు.