ముషీరాబాద్, అక్టోబర్ 1 : (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎన్ రెడ్డి, కే అనిల్ కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రస్మా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆప్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంపై విద్యాశాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు.