02-04-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: బంగారం ధర కొత్త రికార్డులకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 94,150కి చేరుకుంది. బంగారంలో అనేక మంది పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతుండటంతో పుత్తడి జెట్ స్పీడ్తో దూసుకు పోతున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 2025లో ఇప్పటికే బంగారం 18 శాతం మేర పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ. 102,500కి చేరుకుం ది. బంగారం ధర పెరిగేందుకు ట్రంప్ సుంకాల భయం కూడా ఓ కారణం అని ఎనలిస్టులు చెబుతున్నారు.