calender_icon.png 16 March, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండుటెండల్లో చల్లగా..

16-03-2025 12:27:59 AM

కడుపు చల్లగా.. హాయిగా ఉండాలంటే.. ఈ కాలంలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో మసాలాలు.. బయటి ఫుడ్ తగ్గించి ఈజీగా, ఆరోగ్యంగా ఉండే మజ్జిగను ఇంట్లో చేసుకునే తాగితే ఆరోగ్యం కూడా.. అయితే మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.. 

తయారీ: ముందుగా ఒక కప్పు చిక్కటి పెరుగును మిక్సీజార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పెరుగు పలుచగా.. జ్యూస్‌లా అవుతుంది. దాన్ని ఒక పాత్రలోకి తీసుకుని తగినన్నీ నీళ్లు, ఉప్పు, జిలకర పొడి లేదా కారివేపాకు పొడి కలుపుకుంటే సరిపోతుంది. 

లాభాలు..

* మజ్జిగ తాగడం వల్ల శరీరానికి పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్, పీచు, బి1, బి9, సి విటమిన్లు అందుతాయి.

* రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. 

* ఊబకాయం రాదు.

* జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. వేళకు ఆకలి వేస్తుంది. 

* శరీరంలో చేరిన హానికరమైనవి బయటకు వెళ్లిపోతాయి. 

* కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

* మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

* చర్మం పొడిబారదు.

* మానసిక ఒత్తిడి తగ్గుతుంది.