calender_icon.png 10 March, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుడిని బలిగొన్న కూల్ డ్రింక్ మూత

10-03-2025 05:09:19 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): తొమ్మిది నెలల బాలుడు కూల్ డ్రింక్ బాటిల్ మూత మింగి మరణించిన ఘటన లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఆదివారం జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... గడికోప్పల సురేందర్ కు భార్య, కుమార్తె, కుమారుడు రుద్రాయన్ ఉన్నారు. ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో కొమ్ముగూడెం వెళ్లారు. అక్కడ బాలుడు కూల్ డ్రింక్ బాటిల్ మూత నోట్లో పెట్టుకుని ఆడాడు. తర్వాత అది గొంతులోకి జారింది. ఊపిరి ఆడకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే క్యాప్ తీసి కారులో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి రుద్రాయన్ ను తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.