25-03-2025 01:28:52 AM
మండల విద్యాశాఖ అధికారి రాందాస్
మహబూబాబాద్. మార్చి 24: (విజయ క్రాంతి) నూతనవంటసామాగ్రినిఉపయోగించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్నివండాలనిమండల విద్యాశాఖ అధికారిరాందాస్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రభుత్వం అందించినవండడానికి కావాల్సినవంట పాత్రలనుమండల విద్యాశాఖ అధికారి రాందాస్ మండలంలోని 35 పాఠశాలలకు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకుమధ్యాహ్నం భోజనసౌకర్యంకోసం వంట పాత్రలను అందిస్తున్నామని అన్నారు.వంట కార్మికులు వీటిని ఉపయోగించివిద్యార్థులకు మెనూ ప్రకారం మానవమైన వంటలుఅందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలోపాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఎంఆర్సి కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.