సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ పోనిశెట్టి వెంకటేశ్వర్లు
కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక సభ్యత నమోదు చేపట్టాలని అందుకు ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు తప్పనిసరిగా 200 సభ్యత్వాలు చేయాలని బిజెపి సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ పోలిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పాల్వంచ పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీ బిజెపి అని, ఈసారి గతం కన్నా ఎక్కువ సభ్యత్వం చేసి బిజెపి పార్టీ రికార్డును బ్రేక్ చేయాలని కోరారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలంటే సభ్యత్వ నమోదు అత్యధికంగా చేయాలన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య రవీనాయక్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు శివ, జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.