- సచివాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు
=040--2345 4088తో నంబర్ ఏర్పాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ర్ట వ్యాప్తంగా కురుస్తు న్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ర్ట సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రో ల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిన్న జిల్లా కలెక్టర్లతో వర్షాలపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో సచివాల యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ర్టంలో వరదలు, వర్షాలపై పరిస్థితిని పర్వవేక్షించనున్నట్టు తెలిపారు. దీనికనుగుణంగా సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 34లో విపత్తుల నిర్వహణా శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ తెరిచారు. ఈ కంట్రోల్ రూమ్ లో 040-2345 4088 అనే నంబ ర్ను కూడా ఏర్పాటు చేశారు. వర్షా లు, వరదల పరిస్థితిని జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సంప్రదించి వారికి కావాల్సిన సహాయసహకారాలు, తగు సూచనలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అందిస్తారు.