calender_icon.png 20 March, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేయాలి

20-03-2025 12:00:00 AM

కలెక్టర్ బి.సత్యప్రసాద్ 

జగిత్యాల, మార్చి 19 (విజయక్రాంతి): నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు నాణ్యతతో వేగవతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని రాయికల్, సారంగాపూర్ మండలాల్లో కలెక్టర్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. మొదట రాయికల్ మండల బొర్నపల్లి  గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టిన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

నెల రోజుల లోపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఇటిక్యాల గ్రామంలో 9 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి  పనులను అధికారులతో కలిసి పరిశీలించి, నెల రోజుల వరకు త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అల్లిపూర్ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపడుతున్న పల్లె దవఖాన సబ్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఏప్రిల్ మొదటి వారంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సారంగాపూర్ మండలం లచ్చక్క పేట గ్రామంలో చేపడుతున్న సిసి రోడ్ వరక్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే నాగునూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపడుతున్న  పల్లె దవాఖాన నిర్మాణ దశలో ఉన్న పనులను పరిశీలించి, 2 నెలల్లో  వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు.

హెల్త్ సబ్ సెంటర్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్ క్రింద చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ఆసుపత్రి నూతన భవనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిఈ మిలింద్, ఎమ్మార్వో, ఎంపీడీవో సంబంధిత శాఖల అధికారులున్నారు.