calender_icon.png 24 September, 2024 | 10:52 AM

ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి

24-09-2024 02:23:09 AM

గజ్వేల్, సెప్టెంబర్ 23: తమకు భూమి, ప్యాకేజీలు ఇచ్చిన తర్వాతే కంపెనీలు నిర్మాణాలు చేపట్టాలని వర్గల్ మండల భూనిర్వా సితులు సోమవారం కంపెనీలకు కేటాయించిన స్థలంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లాట్లు, ప్యాకేజీలను వెంటనే అందజేయాలని డిమాండ్‌చేశారు.  భూములు ఇచ్చినా తమకు పట్టాలు మాత్ర మే ఇచ్చారని, కానీ భూమి మాత్రం అప్పగించలేద న్నారు. ఇప్పటివరకు ప్యాకేజీ ఊసే లేదన్నారు. ఈ విషయంపై సమగ్ర సర్వే చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.