calender_icon.png 26 October, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి

26-10-2024 05:42:03 PM

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే మంజూరు అయిన వాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ రాజ్ శాఖ, ఈడబ్ల్యూఐడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన వరదల కారణంగా దెబ్బ తిన్న రహదారులకు పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో వేగంగా మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు.

రోడ్ల మరమ్మత్తుల విషయంలో అలసత్వం వహించరాదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే మంజూరు అయిన మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభం కానివి వెంటనే స్టార్ట్ చేయాలని, ఇప్పటికే స్టార్ట్ అయినవి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడుల్లో పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, ఈడబ్ల్యూఐడీసీ డిఈఈ వెంకట్ రెడ్డి, ప్రణాళికా అధికారి, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.