calender_icon.png 13 March, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభం

13-03-2025 12:00:00 AM

జుక్కల్, మార్చి 12 ః కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రా మంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పలువురు లబ్దిదారులు ప్రారంభించినట్టు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు బంగారుపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామానికి నూటఐదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైనవని ఆయన పేర్కొన్నారు.

అందులో కొంతమంది ఇండ్ల నిర్మాణం కొరకు పనులను ప్రారంభించారని, ఇంకొంతమంది పనులు ప్రారంభించలేదని, అందులో భాగంగా నేడు గ్రామాన్ని సందర్శించి, జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు.

లబ్దిదారులకు ఇండ్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పటిష్టంగా నిర్మించుకోవాలని సూచనలు చేయడం జరిగిందని ఆయన అన్నారు.  ప్రభుత్వం మంజూరైన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పుడు లబ్దిదారులకు అందిస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు.