calender_icon.png 28 September, 2024 | 12:57 PM

రంగారెడ్డి కలెక్టరేట్ భవనంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

28-09-2024 10:06:22 AM

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ 28 సంవత్సరాలు, ఏఆర్ కానిస్టేబుల్ నం. 8596, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.