calender_icon.png 2 October, 2024 | 9:48 AM

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

02-10-2024 12:15:02 AM

తాంసి పోలీస్‌స్టేషన్‌లో ఘటన

ఆదిలాబాద్, అక్టోబర్ 1 (విజయ్‌క్రాంతి): విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. జైనథ్ మండలంలోని బెల్గాం గ్రామానికి చెందిన గంగన్న (58) తాంసి స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మంగళవా రం స్టేషన్‌లో విధులకు హాజరైన గంగన్న గుండెపోటుతో స్టేషన్‌లోనే కుప్పకూలి చనిపోయాడు. కాగా అ దే పోలీస్‌స్టేషన్‌లో ఆయన కుమారుడు చిరంజీవి రైటర్‌గా పనిచేస్తు న్నాడు. బెల్గాం గ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిరహించారు.