కాన్పూర్లో పట్టాలపై గ్యాస్ సిలిండర్
ముందుగా గుర్తించటంతో తప్పిన ముప్పు
కాన్పూర్, సెప్టెంబర్ 22: రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలను త్వరలోనే ఛేదిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన మూడు రోజులకే అలాంటిదే మరో కుట్ర జరిగింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో దుండగులు రైల్వే ట్రాక్పై వంటగ్యాస్ సిలిండర్ను ఉంచి భారీ కుట్రకు ప్రయత్నించారు. ఇలాంటి ప్రయత్నం చేయటం ఈ నెలలోనూ ఇది నాలుగోది. పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్పై గ్యాస్ సిలిండర్ను దుండగులు అమర్చారు. ఆ ట్రాక్పై వచ్చిన గూడ్స్రైలు లోకోపైలట్ దాన్ని గుర్తించి రైలును నిలిపేశాడు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదే జిల్లాలో ఈ నెల 8వ తేదీన ట్రాక్పై ఎల్పీజీ సిలిండర్ పెట్టడంతో కాలింది ఎక్స్ప్రెస్ రైలు దాన్ని ఢీకొట్టింది. అయితే లోకో పైలట్ సమయస్ఫూర్తితో వెంటనే రైలు అత్యవసర బ్రేకులు వేసి ఆపేయటంతో పెను ప్రమాదం తప్పింది.