- శివాజీ సిద్ధాంతానికి బీజేపీ వ్యతిరేకం
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ
కొల్హాపూర్, అక్టోబర్ 5: ఛత్రపతి శివాజీ మహరాజ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఆయన విగ్ర హాలకు వంగివంగి దండాలు పెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమ ర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతలు నెలకొల్పిన శివాజీ విగ్రహాలు కూలిపోతూ.. బీజే పీ సిద్ధాంతం తప్పు అని తెలియజేస్తున్నాయని అన్నారు.
మహారాష్ట్రలోని కొల్హా పూర్లో శనివారం శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి సందర్భంగా మాట్లాడారు. ‘శివాజీ మహరాజ్ ఏ సిద్ధా ంతానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో.. ఇప్పుడు కాంగ్రెస్ అదే సిద్ధా ంతానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. మీరు శివాజీ విగ్రహాన్ని నెలకొల్పాలంటే ఆయన సిద్ధాంతాన్ని కూడా రక్షించాలని ఆ సందేశం.
వాళ్ల (బీజేపీ) సిద్ధాంతం తప్పు కాబట్టే విగ్రహం కూలిపోయింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యాంగాన్ని నాశనం చేస్తు న్నారని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగం మనుగడ సాగించాలంటే రిజర్వేషన్లపై ౫౦ పరిమితిని ఎత్తివేయాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు.