07-02-2025 12:18:03 AM
పారిశ్రామిక ప్రాంతాల మత్స ్యకారులను
రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి కొండ సురేఖను కోరిన నీలం మధు
పటాన్చెరు, ఫిబ్రవరి 6 : పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఇస్నాపూర్ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని మెదక్ పార్ల మెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి కొండ సురేఖను కోరారు.
ఈ మేరకు గురువారం ఇస్నాపూర్ మత్స్యకారులతో కలిసి హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు. పాశమై లారం పారిశ్రామిక వాడలో వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో చెరువులు విషపూరితంగా మారాయని, పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధ జలాలు చెరువులో కలవడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలోని చాలా చెరువుల్లో చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయని నీలం మధు మంత్రికి వివరించారు.
ఏ పరిశ్రమల ద్వారా చెరువులకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని కోరారు. కొన్ని చెరువుల్లో కాలుష్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా లేకపోవడంతో ఇక్కడ మత్స్యకార సభ్యులకు సొసైటీలో సభ్యత్వం కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వాపోయారు.
దీంతో ఇక్కడ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలలో అర్హత సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలో నెలకొన్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇస్నాపూర్ మత్స్యకారులను ప్రత్యేకంగా గుర్తించి జిల్లా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని,
పరిశ్రమల నుంచి ప్రతి సంవత్సరం నష్ట పరిహారం ఇప్పించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక వాడలోని మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు నీలం మధు తెలిపారు.
అనంతరం ఈనెల 8వ తేదీన జిన్నారం మండలం కొడకంచిలో జరిగే ఆదినారాయణ స్వామి జాతరకు, ఈనెల 21న ఇస్నాపూర్లో జరిగే పెద్దమ్మతల్లి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలకు మంత్రిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం, గుమ్మడిదల మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, నర్సింగ్ రావు, నాయకులు ప్రతాప్ రెడ్డి, మాణిక్ రావు, నారబోయిన శ్రీనివాస్, వీర్నాల సత్యనారాయణ, సుంకర బోయిన మహేష్, కొడకంచి ఆలయ అర్చకులు, ఇస్నాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మన్నే రాఘవేందర్, ఉళ్ళ శంకర్, ప్యాట నర్సింలు, యాదగిరి, పెంటయ్య, గోపాల్, రాజు, సోములు, మనోహర్, దశరథ్, రవి తదితరులు పాల్గొన్నారు.