బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త గాండ్ల పోశం అలియాస్ డాక్టర్ పోషం ఆదివారం అకాల మరణం పొందారు. గాండ్ల పోశం మరణించిన విషయం తెలుసుకున్న బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరపు వెంకట నర్సింగరావు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్పు ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త పోశo కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గాండ్ల పోశం అంతిమయాత్రలో పాల్గొని పాడెను మోసి కార్యకర్తల తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.