calender_icon.png 4 October, 2024 | 12:30 AM

కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళల ఆగ్రహం..

03-10-2024 09:57:11 PM

కేటీఆర్ ఫ్లెక్సీ దగ్ధం చేసి నిరసన

ఆదిలాబాద్,(విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అట‌వీ శాఖా మంత్రి కొండా సురేఖను కించ ప‌రిచేలా సోష‌ల్ మీడియాలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై జిల్లా మ‌హిళా కాంగ్రెస్ విభాగం భ‌గ్గుమంది. దీనికి మూల కార‌ణమైన కేటీఆర్ బేష‌ర‌తుగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జిల్లా మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు మంచిక‌ట్ల ఆశ‌మ్మ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో గురువారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించి కేటీఆర్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఆయ‌న ఫ్లెక్సీని ద‌హ‌నం చేశారు.

 ఈ సందర్భంగా జిల్లా మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు మాట్లాడుతూ... పెళ్ల‌యింది క‌ళ్యాణ ల‌క్ష్మి ఎప్పుడంటూ ఓ ఆడ‌ప‌డుచు మంత్రి కొండా సురేఖ మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్వ‌వ‌హ‌రించిన కేటీఆర్ వెంట‌నే మంత్రికి క్ష‌మాప‌ణ చెప్పాలి.. లేదంటే మ‌రింత ఉద్రిక్తంగా ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. నిరసనలో మ‌హిళా కాంగ్రెస్ ఉపాధ్య‌క్షురాలు సోనియా, ష‌బానా, జుబేదా, ఖ‌మ‌ర్ బేగం, అఫ్రోజా, నాయ‌కులు గుడిప‌ల్లి న‌గేష్, గిమ్మ సంతోష్, జైన‌థ్ మార్కెట్ క‌మిటి ఛైర్మ‌న్ అల్లూరి అశోక్ రెడ్డి, కౌన్సిల‌ర్లు క‌లాల శ్రీ‌నివాస్, జ‌ఫ‌ర్ అహ్మ‌ద్, లోక ప్ర‌వీణ్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.